byసూర్య | Mon, Jan 13, 2020, 02:08 PM
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ ను నిలిపేశారు. నోడల్ టీం సూచనతో ఆదిలాబాద్ వ్యాప్తంగా ఇంటర్నెట్ ను ప్రభుత్వం నిలిపేసింది. బైంసాలో ఇరు వర్గాల మధ్య ఆదివారం రాత్రి గొడవ జరిగిన విషయం తెలిసిందే. పలు ఇళ్లకు నిప్పు పెట్టడంతో పాటు ఒకరి పై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం బైంసాలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఐజీ, ఎస్పీ బైంసాలో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.