byసూర్య | Mon, Jan 13, 2020, 02:02 PM
తెలంగాణలో పడిపోయిన ఉష్ణోగ్రతలు. ఆదిలాబాద్లోని గిన్నెదరిలో 5.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు, ఆసిఫాబాద్లో 7.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. రాగల మూడురోజుల వరకు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లో చలి తీవ్రత స్వల్పంగా పెరిగింది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో ఏర్పడిన మార్పు వల్ల చల్లదనం పెరిగినట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు