byసూర్య | Sun, Jan 12, 2020, 04:18 PM
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన హైదరాబాద్ లోని గాంధీనగర్ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్ఐ మల్లేశ్ వివరాల ప్రకారం ఈనెల 4న బోయిగూడలో గుర్తు తెలియని వ్యక్తి అపస్నారక స్థితిలో ఉన్నాడని సమాచారం అందడంతో పోలీసులు గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.