byసూర్య | Tue, Oct 15, 2019, 01:37 AM
గత రెండు రోజులుగా ఆర్టీసీ కార్మికులు వరుస ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని సీపీఐ నేత నారాయణ అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. తాజాగా నియమించిన తాత్కాలిక కార్మికులు, ఆర్టీసీ కార్మికుల మధ్య అంతర్యుద్ధం నడుపేందుకు కేసీఆర్ ప్రమత్నిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తీర్చకుండా కేసీఆర్ నియంతలను మించిన పాలన కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలోని ప్రభుత్వాల కన్నా నీచమైన పాలనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యానించారు నారాయణ.