byసూర్య | Sun, Oct 13, 2019, 02:14 PM
కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎక్కడ టెంట్ కనపడినా ఉడుముల్లా చేరిపోయి ఆర్టీసీ కార్మికులను స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. యూనియన్ నాయకుల వెనుక ఒక్కో రాజకీయ పార్టీ ఉందని, 26 డిమాండ్లలో యూనియన్ నాయకులు కేవలం విలీనంపైనే ఎందుకు పట్టుబట్టి కూర్చున్నారని నిలదీశారు. ఏరోజు స్టీరింగ్ పట్టని యూనియన్ నేతలు భవిష్యత్ లో ఎమ్మెల్యేలు కావాలని ప్రయత్నిస్తున్నారని గంగుల అభిప్రాయపడ్డారు.