byసూర్య | Sun, Oct 13, 2019, 02:45 PM
ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్రెడ్డిది ఆత్మహత్య కాదని, ప్రభుత్వం చేసిన హత్య అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. జనగామలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కోదండరాం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల కోసమే ఆర్టీసీ కార్మికులు పోరాటం చేస్తున్నారన్నారు. ఈ పోరాటానికి అందరూ సంఘీభావం ప్రకటించాలన్నారు. జీతాల కోసమే సమ్మె చేస్తున్నారని ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందన్నారు. ఈ నెల 19న బంద్కు విజయవంతం చేయాలన్నారు.