byసూర్య | Sun, Oct 13, 2019, 12:46 PM
గిరిజన పోరాట యోధుడు కొమురం భీం 79వ వర్ధంతి వేడుకలను మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు కొమురం భీం స్టడీ సర్కిల్ వ్యవస్థాపకుడు చిలువేరు పున్నం తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ లోని గాంధీ పార్క్ లో ఏర్పాటు చేసిన వర్ధంతి సభలో కొమురం భీం చిత్ర పటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించి, జోడే ఘాట్ కు వెళ్లనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.