byసూర్య | Sat, Oct 12, 2019, 08:12 PM
ఖమ్మం నగరంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమ్మె విషయంలో ప్రభుత్వ వైఖరిపై మనస్తాపంతో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న శ్రీనివాస్ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. ఆయన్ను ఆపేందుకు యత్నించిన కుమారుడికి కూడా గాయాలయ్యాయి. ఇద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రి వద్దకు భారీగా ఆర్టీసీ ఉద్యోగులు చేరుకుని ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న మణుగూరు డిపోకు చెందిన బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో ఖమ్మం పట్టనంలో పోలీసులు భారీగా మోహరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ రెడ్డి శరీరం 80శాతం వరకు కాలిపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని డాక్టర్లు సూచించారు.