byసూర్య | Thu, Oct 10, 2019, 02:25 PM
న్యూఢిల్లి : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) పేర్కొంది. అలాగే కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి తదితర ప్రంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రానున్న 24 గంటల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు ఐఎండి పేర్కొంది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బెంగాల్, సిక్కిం, ఒడిశా, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవా, ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది.