byసూర్య | Thu, Oct 10, 2019, 02:49 PM
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు త్వరలో నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నాగమడుగు ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లుపై దృష్టి పెట్టింది. కాగా ఈ వారంలోనే కేసీఆర్ జిల్లాలో పర్యటించనున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరావు తెలిపారు.