byసూర్య | Sun, Aug 25, 2019, 06:42 PM
సెప్టెంబర్ మాసం ప్రథమార్థంలోనే సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. త్వరలోనే తేదీలు కూడా ఖరారు కానున్నాయి. గణేష్ నవరాత్రులు, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్ హైకోర్టులో ఈనెల 28న విచారణకు రానుంది. ఒకవేళ ఎన్నికల నిర్వహణకు కోర్టు అనుమతిస్తే వచ్చే నెల మూడు లేదా నాలుగో వారంలో పురపోరు జరిగే అవకాశం ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే వరకే…. బడ్జెట్ సమావేశాలను పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.