byసూర్య | Sun, Aug 25, 2019, 06:38 PM
సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాబడులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో తగ్గుదల ఉందని.. పన్నుల వాటా కూడా తక్కువగా వస్తోందని వివరించారు. అన్నింటినీ పరిశీలించి ప్రభుత్వ ప్రాధాన్యతలు, అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు.