byసూర్య | Sun, Aug 25, 2019, 05:00 PM
జిల్లాలోని వాజేడు మండలంలో గల బోగత జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఆదివారం కావడంతో పర్యాటకులు జలపాతాన్ని చూడడానికి పెద్ద ఎత్తున వచ్చారు. జలపాతం చూపరులను ఇట్టే ఆకర్షిస్తోంది. హొయలు పోతున్న ఆ అలలను చూసి అక్కడికెళ్లిన ప్రతి ఒక్కరు మురిసిపోతున్నారు. ఆనందంలో వారి సందడి అంతా ఇంతా కాదు. ఈ ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడంలేదని వారన్నారు. ఈ సందర్భంగా అందులో ఈతలు కొడుతూ కొందరు, జలపాతం హొయలను చూస్తూ మరికొందరు ఎంజాయ్ చేశారు. చాలా మంది సెల్ఫీలు తీసుకోవడం కనబడింది.