byసూర్య | Sun, Aug 25, 2019, 12:38 PM
గంజాయి అక్రమ రవాణాను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో చోటుచేసుకుంది. వర్ధన్నపేట రాయపర్తి పోలీసులు గంజాయి తరలిస్తున్న కారును వెంబడించారు. దీంతో దుండగులు కారును ఆపి పంటపొలాల్లోకి దూకి పారిపోయారు. వీరిని పట్టుకునేందుకు సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ వెంబడించారు. ఏపీలోని విశాఖపట్నం నుంచి గంజాయి తరలిస్తున్నట్లుగా సమాచారం. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కారును సీజ్ చేశారు.