byసూర్య | Mon, Aug 19, 2019, 01:04 AM
ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రాజెక్టులకు పవిత్రమైన పేర్లు పెట్టి ప్రాజెక్టుల్లో కోట్ల రుపాయాలు దోచుకున్నారని జేపీ నడ్డా ఆరోపణలు చేశారు. ఆదివారం ఎక్సిబిషన్ గ్రౌండ్లో జరిగిన బీజేపీ భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ముప్పైవేల కోట్లతో నిర్మించాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని లక్ష కోట్లకు పెంచారని అన్నారు. ఇందులో భాగంగానే నిధులను పక్కదారి పట్టించారని మండిపడ్డారు, అలేగే హరిత హరంలో కూడ అక్రమాలు జరిగాయని, సంభంధించి కనీస అడిట్ కూడ చేయకుండా నిధులు నొక్కేశారని విమర్శించారు. దీంతో మిషన్ భగీరథ కమీషన్ భగీరథగా మారిందని, కేంద్రం పలు పథకాల్లో ఇచ్చిన నిధులు రాష్ట్రం సద్వినియోగం చేసుకోలేదని, ప్రపంచం మొత్తం ఆయుష్మాన్ భారత్ కార్యకర్యక్రమాన్ని అభినందిస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్కు మాత్రం విమర్శిస్తున్నారని ఆయన అన్నారు.