byసూర్య | Sun, Aug 18, 2019, 10:47 PM
కేంద్ర పార్టీ బీజేపీ దక్షిణాదిన పాగా వేయాలని గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా చాలా మంది రాజకీయ నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటుంది. రాజ్యసభ మాజీ సభ్యుడు చిరంజీవిని కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించినప్పుడు ఆ వార్తలను చిరంజీవి కొట్టిపారేశారు. ఓ ప్రధాన పార్టీ మిమ్మల్ని తమ పార్టీలో చేరమని ఆహ్వానించిందట కదా! అని అడిగితే ``అది పూర్తిగా వాళ్ల ఆలోచన, ఆశ. దానిపై నేనెలా స్పందిస్తాను. ప్రస్తుతానికి నా దృష్టంతా సినిమాలపైనే`` అంటూ సమాధానమిచ్చారు చిరంజీవి.