కేసీఆర్ ది నేను-నా కుటుంబం పాలసీ: నడ్డా
byసూర్య |
Sun, Aug 18, 2019, 08:51 PM
నాంపల్లిలో బీజేపీ నవ తెలంగాణ బహిరంగ సభకు హాజరయిన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా మాట్లాడుతూ . . తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ ది నేను-నా కుటుంబం పాలసీ అని విమర్శించారు. ప్రధాని మోడీకి పేరు వస్తుందని తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆయుష్మాన్ భారత్ ను అమలు చెయ్యడం లేదని నడ్డా ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేది మరొకటి అని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. టీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారని నడ్డా అన్నారు. బీజేపీలోకి వలసలు చూసి, టీఆర్ఎస్ కు కడుపు మండుతోందన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని నడ్డా ఆకాంక్షించారు.
Latest News