byసూర్య | Mon, Jun 24, 2019, 01:06 PM
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మా రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, నియోజకవర్గం తెరాస నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.