byసూర్య | Mon, Jun 24, 2019, 01:58 PM
రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు నిర్వహించారు. ఒకే రోజు 29 చోట్ల పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపనలు జరిగాయి. ఖమ్మం, వనపర్తి మినహా మిగిలిన 29 జిల్లాల్లో శంకుస్థాపనలు జరిగాయి. సిరిసిల్లలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. మహబూబ్నగర్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు.