byసూర్య | Mon, Jun 24, 2019, 11:51 AM
రాజన్నసిరిసిల్ల బైపాస్ రోడ్డులో టీఆర్ఎస్ కార్యాలయానికి శంకుస్థాపన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పార్టీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 27 నుంచి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డులో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 27న పార్టీ మొదటి సభ్యత్వం కేసీఆర్ తీసుకుంటారన్నారు. ఏ ఎన్నికల్లో అయినా ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కడుతున్నారన్నారు. బూత్ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ వరకు పటిష్టంగా పార్టీ నిర్మాణం జరగాలన్నారు. 15 నుంచి నెల రోజుల పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగాలన్నారు. సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్రతి జిల్లాల్లోని పార్టీ నూతన కార్యాలయాల్లో శిక్షణ తరగతులు జరుగుతాయన్నారు. ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధిలా కార్యకర్తలు పని చేయాలన్నారు.