byసూర్య | Wed, Jun 19, 2019, 10:15 PM
హైదరాబాద్ నగరం లో పోలీసుల కళ్ళుగప్పి గంజాయి తరలిస్తున్న ఓ ముఠాను సైబరాబాద్ చందానగర్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. బుధవారం జరిగిన ఈ ఘటనపై మీడియాకు వివరాలందించేందుకు చందానగర్ పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిహెచ్ఇయల్ ఎమ్ ఐ జి ప్రాంతానికి చెందిన రాజేందర్(35) స్థానికంగా డ్రైవర్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు అధిక డబ్బు సంపాదించాలని దురాలోచనతో ఆంధ్రప్రదేశ్లోని తుని నుంచి చెన్నయ్య, ప్రదీప్ అనే వ్యక్తుల దగ్గర నుండి గంజాయిని కొనుగోలు చేస్తూ స్థానికంగా సరఫరా చేసేవాడు. కాగా మంగళవారం నాడు బిహెచ్ఇఎల్ , ఎమ్ ఐ జి లో పోలీసుల తనిఖీల్లో భాగంగా ఓ రెడ్ కలర్ కార్ లో గంజాయ్ తరలిస్తుండగా చందానగర్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుని వద్ద నుంచి ఏడు లక్షల విలువగల 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితున్ని పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. నిందితులను రిమాండుకు తరలిస్తున్నట్టు సిఐ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో రవీందర్ తో పాటు ఎస్సై హైమద్ భాషా, క్రైమ్ ఎ ఎస్ ఐ నరసింహారెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు.