byసూర్య | Fri, Mar 22, 2019, 12:45 PM
యాదాద్రి భువనగిరి ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్కు నర్సయ్యగౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తా సుఖేందర్రెడ్డితో పాటు పలువురు ఉన్నారు.