byసూర్య | Mon, Mar 18, 2019, 04:52 PM
వికారాబాద్ జిల్లాలోని పూడూర్ మండలం కండ్లపల్లి స్టేజీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో రెండు కార్లలో మంటలు చెలరేగి దగ్ధమయ్యాయి. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.