byసూర్య | Mon, Jan 21, 2019, 08:39 PM
కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టు పిటీషన్ దాఖలైంది. తెలంగాణ బిసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిటీషన్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 10 శాతం రిజర్వేషన్ చట్టం రాజ్యాంగానికి, రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధమని పిటీషన్ ఆరోపించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 10 శాతం రిజర్వేషన్ చట్టాన్ని రద్దు చేయాలని పిటీషన్ లో కోరారు. హైకోర్టు ఈ పిటిషన్ ను రేపు విచారించనున్నది.