byసూర్య | Mon, Jan 21, 2019, 08:59 PM
ఇంజనీరింగ్,ఇతర వృత్తి విద్యా కోర్సు ల ఫీజ్ ల పెంపుకు రంగం సిద్ధమైంది. 2019-20 విద్యా సంవత్సరం నుండి 2021-22 విద్యా సంవత్సరం వరకు ఫీజుల ఖరారు కు తెలంగాణ అడ్మిషన్స్, ఫీజుల నియంత్రణ కమిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వృత్తి విద్యా కోర్సుల్లో వచ్చే మూడేళ్ళ ఫీజులను ఖరారు చేయానున్నారు. కాలేజీ ల నుండి దరఖాస్తు లు ఆహ్వానించారు. ఈ నెల 25 నుండి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 21 వరకు అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఈ నెల 25 నుండి వెబ్సైట్ లో అందుబాటులో రానున్నాయి. అయితే ఈ సారి భారీగా ఇంజనీరింగ్ వృత్తి విద్యా కోర్సు ల ఫీజులు పెరగనున్నాయి.