byసూర్య | Mon, Jan 21, 2019, 06:50 PM
మొదటి దశ పంచాయతీ ఎన్నికలలో కూడా తెరాస బలపరిచిన అభ్యర్ధులే దూసుకుపోతున్నారు. మొదటి దశలో 769 పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 3710 గ్రామ పంచాయతీలకు నేడు ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటలవరకు జరిగిన ఓట్ల లెక్కింపులో 602 పంచాయతీలను తెరాస బలపరిచిన అభ్యర్ధులు విజయం సాధించారు. కాంగ్రెస్-34, సిపిఎం-6, సిపిఐ-2, బిజెపి-2, ఇతరులు 106 గెలుచుకున్నారు.