ఆల్కహాల్ మత్తులో ఆడి కారు నడుపుతూ ..

byసూర్య | Mon, Jan 21, 2019, 07:51 PM

ఆల్కహాల్ మత్తులో ఆడి కారు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించారు మందుకొట్టిన ముద్దుగుమ్మలు. వీకెండ్‌లో ఆల్కహాల్ మత్తులో అమ్మాయిలు తాగి ఊగారు. పబ్బుల్లో పీకల్దాక తాగి కార్ల స్టీరింగ్ పట్టి రోడ్డెక్కారు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవ్ చేస్తూ వస్తున్న యువతులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36, ఫిలింనగర్ ప్రాంతాల్లో అర్థరాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.


బంజారాహిల్స్‌కు చెందిన న్యాయవాది అలేఖ్య అనే యువతి పబ్బులో ఫుల్లుగా మందేసి.. టీ.ఎస్.09 బి.వి. టీ.ఆర్. 8312 నెంబర్ గల ఆడి కారు డ్రైవ్ చేసుకుంటూ డైమండ్ హౌస్ వైపునకు వస్తుండగా.. పోలీసులు ఆమె కారును ఆపారు. అలేఖ్యకు బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా.. బ్లడ్‌లో 121 పాయింట్ల ఆల్కహాల్ నిర్థారణైంది. దాంతో అలేఖ్యపై కేసు బుక్ చేశారు. ఆమె ఆడి కారును సీజ్ చేశారు.


టోలిచౌకికు చెందిన మరో యువతి ఉష పబ్బులో ఫుల్లుగా తాగి కారు డ్రైవ్ చేస్తూ ఫిలింనగర్లో పోలీసులకు పట్టుబడింది. ఉష అగర్వాల్‌కు బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా.. మద్యం 63 పాయింట్ల మోతాదుగా నిర్థారణ కావడంతో.. ఉషపై కేసు బుక్ చేసి.. కారును సీజ్ చేశారు. పట్టుబడ్డ యువతులకు భర్తల సమక్షంలో, తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు పోలీసులు. జూబ్లీహిల్స్, ఫిలింనగర్ తనిఖీల్లో 20 కార్లు, 13 బైకులను స్వాధీనం చేసుకున్నారు. చూడండి వీడియోలో...


Latest News
 

హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి,,,,ప్రతి గంటకు బస్సు Thu, Apr 25, 2024, 07:30 PM
ఎంపీ ఎన్నికల బరిలో బాబూ మోహన్.. కేఏ పాల్ పార్టీ నుంచి పోటీ, వీల్‌చైర్‌లో వెళ్లి నామినేషన్ Thu, Apr 25, 2024, 07:24 PM
'తెలంగాణలో లేడీ కేఏ‌ పాల్'.. మాధవీలత చేష్టలపై నెటిజన్ల ట్రోలింగ్ Thu, Apr 25, 2024, 07:18 PM
శుభకార్యంలో 25 వేలు డిమాండ్ చేసిన హిజ్రాలు.. ఇంటికి వచ్చి ఏంటీ దౌర్జన్యం? వీడియో వైరల్ Thu, Apr 25, 2024, 07:13 PM
ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్.. ఆరోజున జీతంతో కూడిన సెలవు Thu, Apr 25, 2024, 07:09 PM