నిరవధికంగా వాయిదా పడ్డ తెలంగాణ అసెంబ్లీ

byసూర్య | Sun, Jan 20, 2019, 04:26 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదించే తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. అనంతరం తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అంతకు ముందు ప్రసంగం సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఏకకాలంలో రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని... అయినా ప్రజలు టీఆర్ఎస్ నే నమ్మారని చెప్పారు. ఏకమొత్తంలో చేస్తామని పంజాబ్ లో కూడా కాంగ్రెస్ చెప్పిందని... ఇంతవరకు అది అక్కడ అమలు కాలేదని విమర్శించారు. రైతు రుణమాఫీపై మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు ఉత్త సంతకాలు మాత్రమే చేశాయని... ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని అన్నారు. రైతు రుణమాఫీని తాము వందకు వంద శాతం చేస్తామని చెప్పారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM