byసూర్య | Sun, Jan 20, 2019, 04:21 PM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సీఎల్పీ నేత, కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క తెరాస పార్టీపై సూటి విమర్శలు చేశారు. తెరాస ప్రభుత్వం ఒక్క ఇరిగేషన్ మీద లక్షకోట్లు ఖర్చు పెట్టారని.. కానీ ఒక్క ఎకరాకు అయినా నీరు ఇవ్వలేదని విమర్శలు చేశారు. ఉద్యమం అంతా సాగునీటి కోసమే జరిగిందని.. నిధుల వినియోగం.. రీ డిజైన్ పై ఆడిటింగ్ జరగాలన్నారు. సీఎల్పీ నేతగా ఎన్నికైన తర్వాత సీనియర్ నేత జానారెడ్డి ఆశీర్వాదం తీసుకున్నానని.. సభ సాధారణంగా జరిగిందన్న భట్టి ప్రశ్నోత్తరాలు.. ఇతర ఎజెండా ఏమీలేదన్నారు. మా ఎమ్మెల్యేల ఆసక్తిని బట్టి అంశాలను విభజిస్తామన్నారు.