byసూర్య | Mon, Jan 14, 2019, 12:26 PM
జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోదాదేవి సమేత శ్రీనివాస కల్యాణ మహోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి కుటుంబసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణ మహోత్సవం సందర్భంగా జగదీష్రెడ్డి-సునీత దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, నూతన పట్టు వస్ర్తాలు సమర్పించారు. అంతకుముందు వేదపండితులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. భక్తులు తరలిరావడంతో కన్నుల పండువగా శ్రీగోదాదేవి శ్రీనివాస కల్యాణ వేడుక జరిపించారు.