byసూర్య | Mon, Jan 14, 2019, 12:41 PM
నాగపూర్ : టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) టీవీ వీక్షకులకు శుభవార్త వెల్లడించింది. వంద పే లేదా ఉచిత చానల్స్ ను కేవలం నెలకు రూ.153.40 లకే అందించాలని ట్రాయ్ ఆదేశించింది. కేబుల్ లేదా డైరెక్టు టు హోం ద్వార అయినా ఫిబ్రవరి 1 నుంచి వంద చానళ్లను టీవీ వీక్షకులకు అందించాలని ట్రాయ్ కోరింది. టీవీ వీక్షకులు జనవరి 31వతేదీలోగా సర్వీసు ప్రొవైడర్లను సంప్రదించాలని ట్రాయ్ సూచించింది. ఈ విషయంలో ఏవైనా సందేహాలుంటే 011-23237922 (ఏకే భరద్వాజ్), 011-23220209 ( అర్వింద్ కుమార్) లను సంప్రదించవచ్చని ట్రాయ్ పేర్కొంది.