వచ్చే నెల 8న తెలుగు సినీ రథసారథుల రజతోత్సవ వేడుక

by సూర్య | Mon, Aug 19, 2019, 05:45 PM

సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌ ప్రారంభించి 25 వసంతాలు పూర్తయిన సందర్భంగా వచ్చే నెల 8న తెలుగు సినీ రథసారథుల రజతోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. గచ్చిబౌలి ఇన్‌డోర్‌ స్టేడియం దీనికి వేదిక కానుంది. అన్నపూర్ణ సెవెన్‌ ఏకర్స్‌ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్‌, నిర్మాతలు కె.ఎస్‌ రామరావు, దిల్‌రాజు, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్‌.శంకర్‌, మా అధ్యక్షుడు నరేశ్‌, జీవితా రాజశేఖర్‌, రాజీవ్‌ కనకాల తదితరులు పాల్గొని ఈ కార్యక్రమానికి తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
సి.కల్యాణ్‌ మాట్లాడుతూ సినిమా పరిశ్రమలో 24 శాఖల మీద దాసరి నారాయణరావుగారికి అమితమైన ప్రమే ఉండేది. ఇప్పుడు ఆయన ఉండి ఉంటే ఈ వేడుక మరోస్థాయిలో జరిగేది అని అన్నారు. సినిమా ప్రారంభానికి ముందే ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ పని మొదలవుతుంది. నిర్మాతలుగా మా పేర్లు పడినా.. ఎక్కువ కష్టం వారిదే ఉంటుంది. ఈ యూనియన్‌ వెల్‌ఫేర్‌కు నా వంతు సాయం చేస్తాం అని కె.ఎస్‌. రామారావు అన్నారు. ఈ వేడుక గ్రాండ్‌ సక్సెస్‌ కావడానికి యావత్‌ సినీ పరిశ్రమ అండగా ఉంటుంది అని దిల్‌ రాజు తెలిపారు.

Latest News
 
నేడు రివీల్ కానున్న 'రాయన్' అప్డేట్ Mon, May 06, 2024, 04:26 PM
బుక్ మై షో టాప్ ట్రేండింగ్ లో 'ప్రసన్నవదనం' Mon, May 06, 2024, 04:23 PM
2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'అశోక వనంలో అర్జున కళ్యాణం' Mon, May 06, 2024, 04:21 PM
'చిత్రం చూడరా' OTT అరంగేట్రంకి తేదీ లాక్ Mon, May 06, 2024, 03:58 PM
షూటింగ్ ప్రారంభించిన విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌ Mon, May 06, 2024, 03:56 PM