బుక్ మై షో టాప్ ట్రేండింగ్ లో 'ప్రసన్నవదనం'

by సూర్య | Mon, May 06, 2024, 04:23 PM

అర్జున్ YK దర్శకత్వంలో టాలీవుడ్ హీరో సుహాస్ నటించిన 'ప్రసన్నవదనం' సినిమా మే 3, 2024న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. తాజాగా మూవీ మేకర్స్ బుక్ మై షోలో ఈ సినిమా టాప్ ట్రేండింగ్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.


ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ మరియు రాశి సింగ్ మహిళా కథానాయికలుగా నటించారు. నందు, వైవా హర్ష, చెముడు, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత మరియు కుశాలిని ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్‌పై మణికంఠ జెఎస్ మరియు ప్రసాద్ రెడ్డి టిఆర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM