'చిత్రం చూడరా' OTT అరంగేట్రంకి తేదీ లాక్

by సూర్య | Mon, May 06, 2024, 03:58 PM

ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ నటించిన 'చిత్రం చూడరా' సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ని ఈటీవీ విన్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా మే 9, 2024న డిజిటల్ ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారంగా ప్రకటించింది.


ఈ చిత్రంలో అల్లరి రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, శివాజీరాజా, శీతల్ భట్, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ, ధన్‌రాజ్, కాశీ విశ్వనాథ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బిఎమ్ సినిమాస్ బ్యానర్‌పై శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. ధన తుమ్మల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రాధన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM