by సూర్య | Tue, Aug 13, 2019, 06:11 PM
హీరోయిన్ రష్మికా మందన్న ప్రస్తుతం వెంకీ కుడుముల, నితిన్ కాంబినేషన్లో రూపొందుతున్న `భీష్మ` సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా నితిన్, రష్మిక, వెంకీ మధ్య సరదా సంభాషణలు చోటు చేసుకున్నాయి. ముందుగా `భీష్మ` సినిమా సెట్స్లో నితిన్, తను మాట్లాడుకుంటున్న ఫోటోను వెంకీ ట్వీట్ చేసి `నేను, నితిన్ మాట్లాడుకుంటుంటే.. వెనకాల రష్మిక ఏమి చేస్తుందో మాకు తెలియద`ని ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్కు రష్మిక వెంటనే స్పందించింది. `ఏయ్.. సెట్స్లో మీరిద్దరూ ఎవరికీ తెలియకుండా ఏమి చేస్తుంటారో చెప్పమంటారా? మీ ఫోటోలు బయటపెట్టమంటారా?` అని బెదిరించింది. దీనికి నితిన్ స్పందిస్తూ.. `మేం ఎక్కడైనా సినిమాల గురించే మాట్లాడుకుంటాం` అని ట్వీట్ చేశాడు. దీనికి మళ్లీ రష్మిక స్పందిస్తూ.. `ఏయ్.. నితిన్ నువ్వు ఆగు. మీరు సింగిల్ అని అంటుంటారు కానీ.. కాదు. నీకు వెంకీ, వెంకీకి నువ్వు తోడుగా ఉంటారు. నిజమైన సింగిల్ నేను` అని రష్మిక ట్వీట్ చేసింది.
Latest News