by సూర్య | Sun, Jun 23, 2019, 12:22 AM
రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. జూలై 14న వరల్డ్ కప్ ఫైనల్స్ జరగనున్న కారణంగా ఆ ప్రభావం సినిమా మీద పడుతుందని , చిత్ర యూనిట్తో చర్చలు జరిపిన దర్శక నిర్మాతలు సినిమా జూలై 12న బదులు జూలై 18న విడుదల చేయాలని నిర్ణయించారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా హీరో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేశ్ లు హీరోయిన్స్గా చేస్తున్నారు. వరుస ఫ్ఆపులతో సతమతమవుతున్న రామ్, పూరీలు ఇటీవల విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్ రావటంతో పాటు ఆడియో కుర్రకారుకి నచ్చటంతో తెగ ఉత్సాహంగా ఉన్నారు.
Latest News