బజ్ : 14 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనున్న మమ్ముట్టి, పృథ్వీరాజ్

by సూర్య | Wed, Apr 17, 2024, 08:32 PM

మమ్ముట్టి తన చివరి చిత్రం బ్రహ్మయుగంతో సూపర్ హిట్ సాధించాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ లేని ప్రయోగాత్మక సబ్జెక్ట్ అయినప్పటికీ, సినిమా సక్సెస్ ఫుల్ గా నిలిచింది. మరోవైపు, పృథ్వీరాజ్ సుకుమారన్ తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను ది గొట్ట లైఫ్‌తో సాధించాడు.


లేటెస్ట్ బజ్ ప్రకారం, మమ్ముట్టి మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ త్వరలో ఒక థ్రిల్లర్‌లో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మమ్ముట్టి మరియు పృథ్వీరాజ్ కథానాయకుడిగా మరియు ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి ఒక నూతన దర్శకుడు దర్శకత్వం వహించనున్నారు.


ఆంటో జోసెఫ్ ఈ సినిమాని నిర్మించనున్నారు. షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుందని సమాచారం. మమ్ముట్టి మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ చివరిసారిగా 2010లో విడుదలైన పోక్కిరి రాజా చిత్రంలో కనిపించారు.

Latest News
 
'RC16' లో బాలీవుడ్ నటుడి కీలక పాత్ర Tue, Apr 30, 2024, 06:10 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'తీస్ మార్ ఖాన్' Tue, Apr 30, 2024, 06:09 PM
'యోధ' డిజిటల్ ఎంట్రీ ఎప్పుడంటే...! Tue, Apr 30, 2024, 06:07 PM
'తాండల్' సెట్స్ లో నాగ చైతన్య Tue, Apr 30, 2024, 06:05 PM
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ ఖరారు Tue, Apr 30, 2024, 06:04 PM