by సూర్య | Thu, Mar 21, 2019, 10:46 PM
తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతిల కాంబినేషన్లో వచ్చిన విక్రమ్ వేద భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మాధవన్ కనిపించగా..కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ గా విజయ్ సేతుపతి నటించారు. పుష్కర్ - గాయత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సినిమా తెలుగు రిమేక్ హక్కులను ఓ భారీ చిత్ర నిర్మణ సంస్ధ దక్కించుకుందని, బాలకృష్ణ, రాజశేఖర్ లతో ఈ చిత్రం నిర్మాణానికి నిర్మాత రడీ అవుతున్నట్టు సినివర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే నిర్మాత బాలకృష్ణను,రాజశేఖర్ ను కలిసి ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. .వారిద్దరు కలిసి సినిమా చేస్తారా లేక ఇది వట్టి పుకారా అని కొద్దిరోజులలో తేలిపోనుంది.
Latest News