by సూర్య | Tue, Mar 12, 2019, 03:24 PM
స్వీటీ అనుష్కకు ఉన్న క్రేజే వేరు. యూత్ ఆడియన్స్ మొదలుకొని చిన్నా పెద్దా, క్లాస్- మాస్ అంతా ఆమె అందం, అభినయానికి ఫిదా అయి అభిమానులుగా మారారు. అయితే ‘భాగమతి’ సినిమా తర్వాత ఈ బ్యూటీ వెండితెరపై కనిపించకపోవడంతో.. ఆమె తర్వాతి ప్రాజెక్ట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది ప్రేక్షకలోకం. ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సైలెన్స్' అనే సినిమాలో అనుష్క నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై కోన వెంకట్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ కథాంశంతో రాబోతున్న ఈ చిత్రంలో అనుష్క దివ్యాంగురాలి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
అయితే ఇదిలా ఉండగానే అనుష్క.. మరో సినిమాకు ఓకే చెప్పేశారని తెలుస్తోంది. అయ్యప్ప స్వామి చుట్టూ సాగే కథతో రూపొందనున్న చిత్రంలో అనుష్క నటించనుందని అంటున్నారు. సంతోష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారట. దీనిని తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆగస్టు నెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నారని తెలుస్తోంది.
Latest News