by సూర్య | Sat, Jan 28, 2023, 02:00 PM
నటుడు, రాజకీయ నాయకుడు తారకరత్న ఆరోగ్యంగా కోలుకుని తిరిగి రావాలని ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. నిన్న జరిగిన పాదయాత్రంలో తారకరత్న కార్డియాక్ అరెస్ట్ కు గురైన విషయం తెలిసిందే. ముందుగా ఆయన కుప్పంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆపై మెరుగైన వైద్యం కోసం తారకరత్నను బెంగుళూరులోని నారాయణ హృదయాలయ లో చేర్పించారు.
ప్రస్తుతం వైద్యులు తారకరత్న కు ఎక్మో పై ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇంటర్నల్ బ్లీడింగ్ మరియు షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోవడంతో వీటిని నియంత్రించడానికి వైద్యబృందం శతవిధాలా కృషి చేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ECMO ట్రీట్మెంట్ కి తారకరత్న స్పందిస్తున్నారని తెలుస్తుంది. తారకరత్న ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుందని వైద్యులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారని తెలుస్తుంది.