గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల

by సూర్య | Sun, Oct 02, 2022, 08:49 PM

భూమి కుంగినా, నింగి చీలినా... న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం" అంటూ ప్రభాస్ గంభీరంగా పలికిన డైలాగ్ తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజైంది. రాముడి జన్మభూమి అయిన అయోధ్యలో నిర్వహించిన ఈవెంట్ లో టీజర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హీరో ప్రభాస్, హీరోయిన్ కృతి సనన్, దర్శకుడు ఓమ్ రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ హాజరయ్యారు. 


"భూమి కుంగినా, నింగి చీలినా... న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం" అంటూ ప్రభాస్ గంభీరంగా పలికిన డైలాగ్ తో టీజర్ ఆరంభమవుతుంది. ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలు పోషించినట్టు టీజర్ ద్వారా అర్థమవుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కృతి సనన్ సీతగా నటిస్తోంది. ఈ భారీ చిత్రానికి 'తానాజీ' ఫేమ్ ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ-సిరీస్, రెట్రోఫైల్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మిస్తున్నారు. ఆదిపురుష్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రానుంది.

Latest News
 
అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న బిగ్ బాస్ బ్యూటీ! Sat, Jul 27, 2024, 02:10 PM
భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ధనుష్ 'రాయన్' మూవీ..... Sat, Jul 27, 2024, 01:15 PM
పొట్టి డ్రెస్ లో ప్రగ్యా జైస్వాల్ మెరుపులు Sat, Jul 27, 2024, 12:38 PM
ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ Sat, Jul 27, 2024, 10:23 AM
ఫ్రెండ్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్! Sat, Jul 27, 2024, 10:13 AM