by సూర్య | Wed, Aug 10, 2022, 10:14 AM
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తొలిసారి తెలుగులో హీరోగా నటించిన చిత్రం "సీతారామం". దుల్కర్ కు స్ట్రాంగ్ మార్కెట్ ఉండే జీసీసీ కంట్రీస్ లో సీతారామం సెన్సార్ క్లియర్ చేసుకోకపోవడంతో ఆగస్టు 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఆ దేశాలలో రిలీజ్ కాలేదు. తదుపరి సీతారామం రీసెన్సార్ కు అప్లై చేసుకోవడం, అందులో క్లీన్ చిట్ అందుకోవడం.. అన్ని చకచకా జరిగిపోయాయి. ఆగస్టు 11వ తేదీన అంటే రేపు సీతారామం యూఏఈ లో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. దీంతో సీతారామం కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది.
హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ ఈ సినిమాను నిర్మించింది.