by సూర్య | Wed, Aug 10, 2022, 10:20 AM
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ చిన్న తనయుడు గణేష్ హీరోగా తెరకెక్కుతున్న తొలి చిత్రం "స్వాతిముత్యం". ఇందులో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. కొత్త దర్శకుడు లక్ష్మణ్ కే. కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ వాస్తవానికి ఆగస్టు 13న థియేటర్లలో విడుదల కావలసి ఉంది. కొన్ని కారణాల వల్ల విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించిన మేకర్స్ లేటెస్ట్ గా ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చెయ్యబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మహతీ స్వరసాగర్ సంగీతమందించారు.
Latest News