by సూర్య | Tue, Aug 09, 2022, 07:04 PM
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, యంగ్ హీరో విజయ్ దేవరకొండ కలిసి చేస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం "లైగర్". బాక్సింగ్ నేపథ్యంలో, పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను ప్రఖ్యాత బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఈ సినిమాతో భారతీయ సినీ రంగ ప్రవేశం చెయ్యడం విశేషం. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలకపాత్రను పోషిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా, పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న లైగర్ ప్రమోషన్స్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇకపై లైగర్ ప్రమోషన్స్ ఎక్కడెక్కడ జరుగుతాయో అభిమానులకు వివరిస్తూ, మేకర్స్ "ఫ్యాన్ డం టూర్" పేరిట ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఇందులో ఏ రోజు ఏ ఊళ్ళో లైగర్ ప్రమోషన్స్ జరుగుతాయో వివరించారు. ఈ మేరకు ఆగస్టు 14న వరంగల్ లో, 15న హైదరాబాద్ లో, 20న గుంటూరు లో లైగర్ మాస్ ప్రమోషన్స్ జరగనున్నాయి.