by సూర్య | Tue, Aug 09, 2022, 07:06 PM
హను రాఘవపూడి డైరెక్షన్లో హృద్యమైన ప్రేమకావ్యంగా రూపొందిన చిత్రం "సీతారామం". ఇందులో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించగా, రష్మిక మండన్నా, సుమంత్, భూమిక, తరుణ్ భాస్కర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, వెన్నెల కిషోర్, మురళీశర్మ కీలకపాత్రలు పోషించారు. గత శుక్రవారం విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతూ, మంచి వసూళ్లను సంపాదిస్తుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, సీతారామం షోలు జీసీసీ దేశాలలో ప్రదర్శితం కానున్నాయట. కొన్ని కారణాల వల్ల గతంలో ఈ సినిమా ప్రదర్శనను నివారించిన ఆ దేశాలు, లేటెస్ట్ గా సీతారామం సినిమాను తమ దేశాలలో ప్రదర్శించడానికి క్లీన్ చిట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో సీతారామం కలెక్షన్లు మరింత పెరగనున్నాయి. ఎందుకంటే, దుల్కర్ కు ఆ దేశాలలో మంచి బలమైన మార్కెట్ ఉంది.