by సూర్య | Tue, May 24, 2022, 11:32 AM
మిస్ వరల్డ్ కిరీటం తెచ్చిపెట్టిన ఆరోభారత అందం మానుషి చిల్లర్. 2017 లో మిస్ వరల్డ్ విజేతగా నిలిచింది. 'పృథ్వీరాజ్' సినిమాతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. జూన్ 3న పృథ్వీరాజ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ తో కలిసి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది చిల్లర్.. సోమవారం నిర్వహించిన ప్రమోషన్ ఈవెంట్ లో అక్షయ్ చిల్లర్ కు ప్రపోజ్ చేయడం ఆకట్టుకుంది. ఎల్లో డ్రెస్ లో మానుషీ ముసి ముసి నవ్వులు చిందిస్తూ. అక్షయ్ ప్రపోజల్ ని స్వీకరించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వైరల్ గా మారాయి. చిల్లర్ నటిస్తున్న మరో సినిమా 'ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ' కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. రిలీజ్ కి రెడీగా ఉంది.
Latest News