by సూర్య | Mon, May 23, 2022, 10:07 PM
రకుల్ ప్రీత్ సింగ్... ప్రస్తుతం బాలీవుడ్లో వరస సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతుంది. అంతకుముందు టాలీవుడ్, కోలీవుడ్లలో స్టార్ హీరోయిన్ గా తన హవా చూపించింది రకుల్. ఈ మధ్య సౌత్ లో అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో బాలీవుడ్లో పాగా వేయాలని అటుగా ప్రయాణించింది. ఇప్పటికే షూటింగ్లను పూర్తి చేసుకున్న డాక్టర్ జీ, థాంక్ గాడ్, మిషన్ సిండ్రెల్లా, ఛత్రీవాలి సినిమాలు ఈ ఏడాదిలోనే వరసగా విడుదలవబోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ జాకితో తన రిలేషన్ షిప్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ నటుడు, నిర్మాత ఐన జాకీ భగ్నానీ తో రకుల్ ప్రేమాయణాన్ని నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని గత బర్త్ డే నాడు రకుల్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. జాకితో రిలేషన్ షిప్ ను రకుల్ అధికారికంగా ప్రకటించినప్పటి నుండి మీడియా ఆమెను పెళ్లెప్పుడంటూ ? ప్రశ్నిస్తూనే ఉంది. దీంతో విసిగిపోయిన రకుల్ కొన్ని సార్లు అసహనం కూడా వ్యక్తం చేశారు. తాజాగా రకుల్ మరోసారి తన ప్రేమ గురించి స్పందించారు. జాకీ టేస్టులు, తన టేస్టులు బాగా కలవడం వల్లే తమిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, తమకు తాము కన్ ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీడియా సుముఖంగా తమ ప్రేమను అధికారికంగా ప్రకటించామని రకుల్ తెలిపారు. లైఫ్లో పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలాగే మన కోసం ఒక స్పెషల్ పర్సన్ కూడా ఉంటారు, తాము సెలెబ్రిటీలు కావడం వల్ల అందరి దృష్టి తమపైనే ఉంటుందని రకుల్ చెప్పారు. తమ పర్సనల్ లైఫ్ గురించి కాదు, ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాట్లాడుకోవాలి అంటూ మీడియాకు హితబోధ చేసారు రకుల్.
Latest News