by సూర్య | Thu, May 19, 2022, 09:33 PM
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం 'సలార్'. సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హై వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనెర్గా రూపొందుతున్న ఈ చిత్రం లో శృతిహాసన్ కథానాయిక. ఎప్పుడో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటికి కేవలం 30 శాతం షూటింగ్ ని మాత్రమే పూర్తి చేసుకుంది. ఆపై ప్రభాస్ రాధేశ్యామ్ తో, ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 సినిమాల ప్రమోషన్లతో బిజీ అవ్వడం వలన సలార్ మూవీకి చాలా కాలం విరామం వచ్చింది.
తాజాగా ఈ మూవీ పై ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఒక భారీ యాక్షన్ సీన్ గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్తో డిస్కస్ చేస్తున్న వీడియో ను సలార్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. ఈ యాక్షన్ సీన్ తోనే తాజా షెడ్యూల్ ప్రారంభమవబోతుందని సమాచారం. ఈ నెల 24నుండే షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ కే షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ మూవీ షెడ్యూల్ అయిపోయిన వెంటనే సలార్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రం ఇదే.
Latest News