by సూర్య | Sat, Jun 12, 2021, 01:43 PM
కరోనా బారిన పడి దాదాపు నెలరోజులు విశ్రాంతి తీసుకున్న బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఇప్పుడు లాక్ డౌన్ వేళ పూర్తిగా కోలుకున్నారు. మునుపటి స్థాయికి వచ్చారు. ఆ మధ్య కరోనాతో ఒంటరిగా క్వారంటైన్ లో ఉన్న ఫొటో షేర్ చేసి విషాద గీతాలు ఆలపించిన ఈ ముద్దు గుమ్ము ఇప్పుడు షూటింగ్ కు రెడీ అయ్యారు.ఆలియా భట్ ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’తోపాటు.. హిందీలో సంజయ్ లీలా భన్సాలీ తీస్తున్న ‘గంగూభాయ్ కథియావాడీ’ అనే సినిమాలోనూ నటిస్తున్నారు. ఆ సినిమా దాదాపు పూర్తి అయ్యింది. ఒక్క పాట మాత్రమే మిగిలి ఉంది.ఆమె చేతిలో ప్రస్తుతం అన్నీ బడా ప్రాజెక్టులే ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతి ప్రాజెక్ట్కి పక్కా ప్లానింగ్తో డేట్స్ సెట్ చేసుకుంటున్న అలియా భట్.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం డేట్స్ అడ్జెస్ట్ చేయడానికి తంటాలు పడుతుందట. కరోనా కారణంగా వాయిదా పడిన షెడ్యూల్ త్వరలోనే రాజమౌళి స్టార్ట్ చేయనున్నాడు. ఆల్రెడీ సగం పార్ట్ షూటింగ్ పూర్తి చేసిన అలియా ఈసారి షెడ్యూల్ తో ఆర్ఆర్ఆర్ సీతగా పూర్తి షూటింగ్ కంప్లీట్ అవుతుందని టాక్. కానీ అమ్మడు ఆర్ఆర్ఆర్ తో పాటు బాలీవుడ్ గంగుబాయ్ కతీయవాడి మూవీ చేస్తోంది. ఆ సినిమాను స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నాడు. అయితే ప్రస్తుతం అలియా ఆర్ఆర్ఆర్ సినిమాకు డేట్స్ కేటాయించే విషయంలో భన్సాలీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరి అలియా నెక్స్ట్ షెడ్యూల్ పాల్గొంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది
Latest News