by సూర్య | Wed, Jun 09, 2021, 01:13 PM
హీరో రాజశేఖర్ ప్రస్తుతం “మర్మాణువు “మూవీ లో నటిస్తున్నారు. రాజశేఖర్ బర్త్ డే సందర్భంగా రాజశేఖర్ 91 వ మూవీ అనౌన్స్ మెంట్ జరిగింది.కరోనాతో ఆసుపత్రి పాలై కోలుకున్న రాజశేఖర్ మూడు సినిమాలు అనౌన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. వాటిలో ఒకటి మలయాళ హిట్ చిత్రం జోసెఫ్ కు తెలుగు రీమేక్. తెలుగులో శేఖర్ పేరుతొ ఈ సినిమా తెరకెక్కనుంది. రాజశేఖర్ కు జోడిగా మలయాళ బ్యూటీ అను సితార ను ఇప్పుటికి ఫైనల్ చేసారు.తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణ లో ఎమ్.ఎల్.వి.సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మాతలుగా లలిత్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా “శేఖర్ “మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో “జార్జ్ రెడ్డి ” మూవీ ఫేమ్ ముస్కాన్ ఒక హీరోయిన్ కాగా మలయాళ నటి అను సితార మరో కథానాయికగా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సినిమాలో రాజశేఖర్ పెద్ద వయస్కుడిగా నటిస్తుండటంతో అయన కుమార్తె పాత్రకుకూడా ప్రాధాన్యత ఉంటుంది. ఈ రోల్ కోసం జార్జిరెడ్డి హీరోయిన్ ముస్కాన్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. రాజశేఖర్ కూతుళ్లిద్దరూ కూడా ఈ సినిమాకు సహా నిర్మాతలు కావటం విశేషం.
Latest News